శ్రీ వేదాంతం సీతారామ అవధాని సంకల్పానికి సజీవ సాక్ష్యం
ప్రతి ఒక్కరినీ గౌరవప్రదమైన పిలుపుతో పలకరించే స్వభావం, బాల్య మిత్రుడైనా, సన్నిహితుడైనా “అండీ, అండి” అని సంబోధించే సంస్కారం, ఇది వేదాంతం సీతారామ అవధాని గారికి సహజ లక్షణం. ఆ గౌరవభావమే ఆయన వ్యక్తిత్వానికి తొలి పరిచయం. కానీ ఆయన బాల్యం సాఫీగా సాగలేదు. లా చదువుతున్న సమయంలో తండ్రి గారి అకాల మరణం, జీవితాన్ని ఒక్కసారిగా శోక సముద్రంలోకి నెట్టింది. ఆర్థిక, మానసిక కుదుపులు, బాధ్యతల బరువు ఇవన్నీ కలిసి చదువులకు పుల్స్టాప్ పడినట్టే అనిపించిన క్షణాలు ఎన్నో. “ఇక చదువు సాధ్యం కాదు” అని చాలామంది అనుకున్న వేళ, అవధాని గారు మాత్రం మౌనంగా ఒక నిర్ణయం తీసుకున్నారు.
“నేను చదివి సాధిస్తాను” ఆ ఒక్క సంకల్పమే ఆయన ఆయుధం. పరిస్థితులు ప్రతికూలమైనా, మనోధైర్యం కోల్పోకుండా ముందుకు నడిచారు. బాధను బలంగా మార్చుకుని, అడ్డంకులను మెట్లుగా చేసుకుని, తన ప్రయాణాన్ని తానే నిరూపించారు. ఈ కథ ఒక్క వ్యక్తి విజయం మాత్రమే కాదు, నిరాశలో ఉన్న ప్రతి మనసుకు కనువిప్పు. పరిస్థితులు కాదు, "సంకల్పమే మన భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది" అనే సత్యానికి శ్రీ వేదాంతం సీతారామ అవధాని గారు నిలువెత్తు ఉదాహరణ.